యాప్నగరం

తరగతి లీడర్ కోసం పోటీ.. అమ్మాయిపై ఓటమి, బాలుడి ఆత్మహత్య, యాదాద్రిలో విషాదం

Yadadri Bhongir | ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి లీడర్ కోసం నిర్వహించిన పోటీ విషాదానికి కారణమైంది. ఎన్నికల్లో ఓడిపోయానని మనస్థాపానికి గురై విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 20 Jul 2019, 12:01 am
ది ఎనిమిదో తరగతి. తరగతి లీడర్ కోసం పాఠశాల నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ బాలుడు ఓటమి పాలయ్యాడు. పైగా ఓ అమ్మాయితో పోటీపడి పరాజయం పాలయ్యాడు. ఇది ఆ పసిమనసును ఎంతగానో కుంగదీసింది. మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Samayam Telugu charan
సాయి చరణ్


యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన సాయి చరణ్‌.. మండల కేంద్రంలోని క్రిష్ణవేని టాలెంట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత బుధవారం (జులై 16) ఆ పాఠశాలలో తరగతి లీడర్‌ కోసం పోటీలు నిర్వహించారు. లీడర్‌గా పోటీచేసిన చరణ్‌ ఓటమి పాలయ్యాడు.

మనస్తాపానికి గురైన చరణ్ గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన తల్లిదండ్రులకు చేదు వార్త తెలిసింది. రైలు పట్టాలపై చరణ్ విగతజీవిగా కన్పించాడు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడి మృతదేహాన్ని చూసి చరణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చరణ్ మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.