యాప్నగరం

విజయవాడ చేరుకున్న అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, చంద్రబాబుతో కలిసి విజయవాడ చేరుకున్నారు.

TNN 25 May 2017, 11:12 am
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, చంద్రబాబుతో కలిసి విజయవాడ చేరుకున్నారు. వీరిద్దరూ ఒకే విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. వీరితో పాటూ కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి కూడా ఉన్నారు. అమిత్ షా తెలంగాణాలో మూడు రోజుల పర్యటనను పూర్తి చేసుకున్నారు. నేటి నుంచి ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. గన్నవరంలో ఏపీ సీఎంతో కలిసి 13 అంబులెన్స్ లను ప్రారంభించారు. ఈ అంబులెన్స్ లను కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొన్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొని... రాత్రి నగరంలోనే విశ్రమించారు. ఉదయాన అమిత్ షాతో కలిసి విజయవాడ వెళ్లారు. వీరిద్దరి మధ్య ప్రస్తుత రాజకీయాల గురించి పలు విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.