యాప్నగరం

ఘనంగా దశావతార వెంకటేశ్వరుడి విగ్రహ ప్రతిష్ట.. ఎదురుపడినా పలకరించుకోని బాబు, పవన్

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ దగ్గర శ్రీ భూసమేత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్ర ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Samayam Telugu 22 Jun 2018, 1:17 pm
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ దగ్గర శ్రీ భూసమేత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్ర ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఆలయంలో యంత్ర ప్రతిష్ట చేసి.. 11 అడుగుల వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గరుడ ఆల్వార్, విశ్వక్‌సేనుడి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా జరిగింది. స్వామివారికి పవన్, చంద్రబాబులు పట్టువస్త్రాలు, లాంఛనాలను అందజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Samayam Telugu Venkateswara Swamy


పవన్, చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఎడమొహం పెడ మొహంగా ఉన్నారు. ఇద్దరూ ఎదురుపడినా కనీసం పలకరించకోలేదు. ఆలయం దగ్గరకు చేరుకున్న సీఎం.. అక్కడున్న భక్తులకు అభివాదం చేస్తూ వెళ్లగా.. ఆ పక్క నుంచే పవన్ కూడా వెళ్లారు. పూజ చేస్తున్న సమయంలో కూడా ఇద్దరు పక్కపక్కనే నిలబడినా కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమంలో పలకరించుకుంటారని భావించినా అలా జరగలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.