యాప్నగరం

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభం

గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు ప్రారంభమైంది. ప్రారంభం నుంచి పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (ఆగస్టు 15) ప్రారంభించారు..

TNN 15 Aug 2017, 3:40 pm
గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు ప్రారంభమైంది. ప్రారంభం నుంచి పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (ఆగస్టు 15) ప్రారంభించారు. తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగించుకొని ఆయన నేరుగా తూర్పుగోదావరి జిల్లాకు తరలివెళ్లారు. పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం తొలి విడతను ప్రారంభించిన చంద్రబాబు రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు.
Samayam Telugu cm chandrababu inaugurates purushothapatnam lift irrigation scheme
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభం


మొదటి విడతలో మెట్ట రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ ఫథకం ఎట్టకేలకు ప్రారంభానికి నోచుకుంది. ఈ పథకం ముందుగా అనుకున్నమేరకు లక్ష్యాన్ని అందుకోలేకపోయినా నీటి విడుదలకు సంబంధించి ప్రాథమిక దశను మాత్రం అధిగమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.