యాప్నగరం

ఏపీలో భారీ వర్షాలు: అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్...

ఆంధ్రప్రదేశ్‌లోనూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందును లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

Samayam Telugu 20 Aug 2018, 12:27 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సోమవారం (ఆగస్టు 20) ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
Samayam Telugu cbn


ఈ కాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరదలతో కేరళ కకావికలం అయ్యిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందును లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సంక్షోభాల్లోనే మన సామర్ధ్యం బయటపడుతుందని, అధికారులు, సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. అవనిగడ్డలో పాముకాట్లపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆరా తీశారు. అన్ని ఆసుపత్రులలో యాంటి వీనమ్ సీరమ్ నిల్వ ఉంచుకోవాలన్నారు.

ప్రస్తుతం కీలక సమయమని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్‌, విపత్తు నిర్వహణ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రాణ నష్టం నివారించడంతో పాటు ఆస్తి నష్టం తగ్గించాలని సూచించారు. అన్ని ప్రాంతాలలో లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.