యాప్నగరం

పవన్ కల్యాణ్ తిక్కుంటే, నాకు పిచ్చి ఉంది

తిరుపతి సభలో ఏపికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ నేతలనుద్దేశించి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు...

TNN 28 Aug 2016, 8:07 pm
శనివారం తిరుపతిలో నిర్వహించిన సభలో ఏపికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ నేతలనుద్దేశించి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ కు కౌంటర్లు ఇస్తున్నారు. హోదా కోసం మన ఎంపీలు ప్రధాని దగ్గర సార్.. సార్ అని అడుక్కుంటున్నారు అనే వ్యాఖ్యల పట్ల తాజాగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. 'పవన్ ఏం మాట్లాడతాడు? మేం సార్.. సార్ అని అడుక్కుంటున్నామా? ప్రధానమంత్రిని సార్ అని పిలవకపోతే ఏమనాలి? ఎదుటివారికి నీతులు చెప్పేటపుడు తానేం చేస్తున్నాడు? ఆయనకు తిక్క ఉంటే నాకు పిచ్చి ఉంది' అని అవంతి మండిపడ్డారు. ప్రత్యేకహోదా కోసం సీఎం చంద్రబాబు 23 సార్లు ఢిల్లీ వెళ్లారని గుర్తుచేశారు. పవన్ నీతులు వల్లించడం మాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరఫున పోరాడాలని అవంతి సూచించారు. అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా 'పవన్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఎంపీ పదవి నాకు వెంట్రుకతో సమానం' అని నేరుగా పవన్ ను విమర్శించారు.
Samayam Telugu cm chandrababu reacts on pawan kalyan
పవన్ కల్యాణ్ తిక్కుంటే, నాకు పిచ్చి ఉంది


సీఎం చంద్రబాబు రియాక్షన్: తిరుపతి సభలో ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు సీబీఐ గురించి భయపడుతున్నారా? అని పవన్ ప్రశ్నించారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై మాట్లాడటం సంతోషకరం. తాను ఎవ్వరికీ భయపడటం లేదని, ఇకముందు కూడా భయపడనని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై 25 కేసులు పెట్టారని ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక హోదా కోసం గట్టిగానే పోరాడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.