ఏపీ అసెంబ్లీ భవనానికి 30న శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణానికి దసరా పండగ రోజున అంకురార్పణ పడనుంది. సెప్టెంబర్ 30న ఉదయం 8.26 గంటలకు అసెంబ్లీ భవనం, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన..
TNN 9 Sep 2017, 10:03 am
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణానికి దసరా పండగ రోజున అంకురార్పణ పడనుంది. సెప్టెంబర్ 30న ఉదయం 8.26 గంటలకు అసెంబ్లీ భవనం, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన పైల్ ఫౌండేషన్ పనులకు సీఆర్డీఏ శుక్రవారం (సెప్టెంబర్ 8) టెండరు ప్రకటన జారీ చేసింది. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో ఈ టెండరు ఆహ్వానించారు.
అసెంబ్లీ భవనం కోసం.. లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ కోహినూర్ వజ్రాన్ని పోలిన ఆకృతిని సిద్ధం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడలో సీఆర్డీఏ అధికారులతో సమావేశమవనున్నారు. అనంతరం సెప్టెంబర్ 13న సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆ ఆకృతిని ఆమోదించనున్నారు. అదే రోజు హైకోర్టు భవన తుది ఆకృతిపై కూడా చర్చిస్తారు.
అసెంబ్లీ భవనం కోహినూర్ ఆకృతిలా కనిపించేలా, భవనం సెంట్రల్ అట్రియం వజ్రం ఆకృతిలో ఉండేలా నార్మన్ ఫోస్టర్ సంస్థ రెండు భిన్నమైన ఆకృతుల్ని సిద్ధం చేసింది. ఇందులో ఒకదాన్ని ఖరారు చేస్తారు. దీన్ని మొత్తం 4 అంతస్తుల్లో నిర్మిస్తారు. మొదటి అంతస్తులో శాసన సభ, శాసన మండలి, సెంట్రల్ హాల్, కార్యాలయాలు ఉంటాయి. గూగుల్ కార్యాలయ భవనం కంటే బాగుండాలని సీఎం నిర్దేశించారని, దానికి అనుగుణంగానే ఆకృతులు రూపొందిస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు నిర్మించే ప్రభుత్వ క్వార్టర్లకు సీఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా సుమారు 4 వేల ఫ్లాట్లు నిర్మించనున్నారు. వీటికి కూడా సెప్టెంబర్ 30న సీఎం శంకుస్థాపన చేస్తారు.
అసెంబ్లీ భవనం కోసం.. లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ కోహినూర్ వజ్రాన్ని పోలిన ఆకృతిని సిద్ధం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడలో సీఆర్డీఏ అధికారులతో సమావేశమవనున్నారు. అనంతరం సెప్టెంబర్ 13న సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆ ఆకృతిని ఆమోదించనున్నారు. అదే రోజు హైకోర్టు భవన తుది ఆకృతిపై కూడా చర్చిస్తారు.
అసెంబ్లీ భవనం కోహినూర్ ఆకృతిలా కనిపించేలా, భవనం సెంట్రల్ అట్రియం వజ్రం ఆకృతిలో ఉండేలా నార్మన్ ఫోస్టర్ సంస్థ రెండు భిన్నమైన ఆకృతుల్ని సిద్ధం చేసింది. ఇందులో ఒకదాన్ని ఖరారు చేస్తారు. దీన్ని మొత్తం 4 అంతస్తుల్లో నిర్మిస్తారు. మొదటి అంతస్తులో శాసన సభ, శాసన మండలి, సెంట్రల్ హాల్, కార్యాలయాలు ఉంటాయి. గూగుల్ కార్యాలయ భవనం కంటే బాగుండాలని సీఎం నిర్దేశించారని, దానికి అనుగుణంగానే ఆకృతులు రూపొందిస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు నిర్మించే ప్రభుత్వ క్వార్టర్లకు సీఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా సుమారు 4 వేల ఫ్లాట్లు నిర్మించనున్నారు. వీటికి కూడా సెప్టెంబర్ 30న సీఎం శంకుస్థాపన చేస్తారు.