పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఓ కీలక మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం.. పోలవరం పనుల్ని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టులో ముఖ్యమైన డయాఫ్రం వాల్ పనుల్ని పూర్తైన సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించి.. ఆ వాల్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇంజినీర్లను సీఎం ఘనంగా సన్మానించారు. 24 గంటల్లో 11158వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ను పూర్తి చేయడం అద్భుతమని ప్రశంసలు కురిపించారు. పనుల్ని వేగవంతం చేసిన ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని అభినందించారు.
'దేశం మొత్తం పోలవరంవైపు చూస్తోంది. పోలవరం కలను సాకారం చేయడానికి ప్రభుత్వం పని చేస్తోంది.. రాబోయే రోజుల్లోనూ పనుల్ని మరింత వేగవంతం చేస్తాం. డయా ఫ్రం వాల్ను రికార్డు సమయంలో పూర్తి చేయడం ఓ చరిత్ర. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నాకు సోమవారం పోలవారమే. 63 వారాలు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసి కష్టపడుతుంటే ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేస్తాం. ప్రాజెక్టును పూర్తి చేయడం నా జీవిత ఆశయం' అన్నారు బాబు.
'పోలవరం మాత్రమే కాదు.. రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తున్నాం. రాయలసీమలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసి.. నీళ్లు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. సాగునీరు అందుబాటులో ఉంటే.. బంగారం పండించే రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు' సీఎం.
'దేశం మొత్తం పోలవరంవైపు చూస్తోంది. పోలవరం కలను సాకారం చేయడానికి ప్రభుత్వం పని చేస్తోంది.. రాబోయే రోజుల్లోనూ పనుల్ని మరింత వేగవంతం చేస్తాం. డయా ఫ్రం వాల్ను రికార్డు సమయంలో పూర్తి చేయడం ఓ చరిత్ర. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నాకు సోమవారం పోలవారమే. 63 వారాలు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసి కష్టపడుతుంటే ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేస్తాం. ప్రాజెక్టును పూర్తి చేయడం నా జీవిత ఆశయం' అన్నారు బాబు.
'పోలవరం మాత్రమే కాదు.. రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తున్నాం. రాయలసీమలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసి.. నీళ్లు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. సాగునీరు అందుబాటులో ఉంటే.. బంగారం పండించే రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు' సీఎం.