యాప్నగరం

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: కేసీఆర్

వరంగల్ భద్రకాళి బాణాసంచా గోదాంలో బుధవారం (జులై 4) జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

Samayam Telugu 4 Jul 2018, 8:16 pm
వరంగల్ భద్రకాళి బాణాసంచా గోదాంలో బుధవారం (జులై 4) జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
Samayam Telugu KCR


మరోవైపు అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఇప్పటివరకూ 11మంది మృతి చెందారని, ముగ్గురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.