బొల్లారం: రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్హోం
సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం (డిసెంబర్ 26) ఎట్హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
TNN 26 Dec 2017, 10:32 pm
సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం (డిసెంబర్ 26) ఎట్హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, సభాపతి మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మా దేవేందర్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత జానారెడ్డి సహా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు రాష్ట్రపతి రామనాథ్ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవింద్.. బుధవారం గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో కొంతసేపు ఆగనున్నారు.
బుధవారం ఉదయం 9.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని గౌరవ వందనం స్వీకరించి అనంతరం రాష్ట్రపతి హెలికాఫ్టర్లో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే ‘ఇండియన్ ఎకనామిక్ సదస్సు’కు హాజరవుతారు. అక్కడి నుంచి వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లి ఫైబర్ గ్రిడ్ను ప్రారంభిస్తారు.
మరోవైపు రాష్ట్రపతి రామనాథ్ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవింద్.. బుధవారం గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో కొంతసేపు ఆగనున్నారు.
బుధవారం ఉదయం 9.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని గౌరవ వందనం స్వీకరించి అనంతరం రాష్ట్రపతి హెలికాఫ్టర్లో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే ‘ఇండియన్ ఎకనామిక్ సదస్సు’కు హాజరవుతారు. అక్కడి నుంచి వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లి ఫైబర్ గ్రిడ్ను ప్రారంభిస్తారు.