గ్రామాల అభివృద్ధి, కుల వృత్తులకు ప్రోత్సాహంలోనే రాష్ట్రాభివృద్ధి ఇమిడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం ఆయన ప్రగతి భవన్ లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఎస్సీ గురుకుల పాఠశాలల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం, కొత్త జిల్లాల్లో మౌలిక వసతులు, పరిపాలన భవనాలు,అధికారుల నియామకాలు, సాదాబైనామాల ఉచిత రిజిస్ట్రేషన్లు తదితర అంశాలపై చర్చించారు.
కొత్తగా ఏర్పడ్డ 21జిల్లాల్లో నిర్మించనున్న సమీకృత భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు స్థలాల సేకరణతోపాటు బిల్డింగ్ప్లాన్లనూ సమర్పించారు. జిల్లాలవారీగా అందిన ప్రణాళికలను ఉన్నతాధికారులు పరిశీలించారు.
గొర్రెల పెంపకందారులు, మత్స్యకారుల జీవితాలలో కొత్త వెలుగును తేవడానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఏ విధంగా క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలుపరుచాలనే విషయంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.
‘సమైక్యాంధ్ర పాలనతో ఎస్సీలు ఊరికి దూరంగా ఉంచారు. ఎస్టీలను తండాలకు పరిమితం చేశారు. ఈ పరిస్థితి మారాలి’’ అని కేసీఆర్ అధికారులకు సూచించారు. బండలపైనా, చెట్లకింద నాయి బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకునే సెలూన్లు పోయి వాటి స్థానంలో సెలూన్ షాపులు పెట్టుకునేలా చూడాలన్నారు.
గొర్రెల పెంపకందారులకు దాదాపు నాలుగు లక్షల యూనిట్లను (సుమారు 84లక్షల గొర్రెలను) పంపిణీ చేయాలని సీఎం సంకల్పించిన విషయం తెలిసిందే. మత్స్యకారుల కోసం ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా 30 కోట్ల చేప పిల్లలను చెరువులలోకి వదిలింది. చేపలు పెద్దవైన తర్వాత వాటిని దళారుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు నేరుగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలపై చర్చించారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రకటించిన రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు స్థల సేకరణ వేగవంతంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అణగారిన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో సముచిత కేటాయింపులు ఉండేలా చూడాలని చెప్పారు.
కొత్తగా ఏర్పడ్డ 21జిల్లాల్లో నిర్మించనున్న సమీకృత భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు స్థలాల సేకరణతోపాటు బిల్డింగ్ప్లాన్లనూ సమర్పించారు. జిల్లాలవారీగా అందిన ప్రణాళికలను ఉన్నతాధికారులు పరిశీలించారు.
గొర్రెల పెంపకందారులు, మత్స్యకారుల జీవితాలలో కొత్త వెలుగును తేవడానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఏ విధంగా క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలుపరుచాలనే విషయంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.
‘సమైక్యాంధ్ర పాలనతో ఎస్సీలు ఊరికి దూరంగా ఉంచారు. ఎస్టీలను తండాలకు పరిమితం చేశారు. ఈ పరిస్థితి మారాలి’’ అని కేసీఆర్ అధికారులకు సూచించారు. బండలపైనా, చెట్లకింద నాయి బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకునే సెలూన్లు పోయి వాటి స్థానంలో సెలూన్ షాపులు పెట్టుకునేలా చూడాలన్నారు.
గొర్రెల పెంపకందారులకు దాదాపు నాలుగు లక్షల యూనిట్లను (సుమారు 84లక్షల గొర్రెలను) పంపిణీ చేయాలని సీఎం సంకల్పించిన విషయం తెలిసిందే. మత్స్యకారుల కోసం ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా 30 కోట్ల చేప పిల్లలను చెరువులలోకి వదిలింది. చేపలు పెద్దవైన తర్వాత వాటిని దళారుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు నేరుగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలపై చర్చించారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రకటించిన రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు స్థల సేకరణ వేగవంతంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అణగారిన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో సముచిత కేటాయింపులు ఉండేలా చూడాలని చెప్పారు.