యాప్నగరం

గొర్రెల కాపరి కవితకు కేసీఆర్ ప్రశంస!

సమాజంలోని ఇబ్బందులపై నేనూ ఎందుకు స్పందించకూడదు అనుకున్నాడు ఓ గొర్రెల కాపరి..

TNN 18 May 2017, 4:16 pm
సమాజంలోని ఇబ్బందులపై నేనూ ఎందుకు స్పందించకూడదు అనుకున్నాడు ఓ గొర్రెల కాపరి. నీటి సమస్యలపై ఆయన ఓ కవిత రాశారు. ఇది ఆ నోటా.. ఈ నోటా పడి తెలంగాణ సీఎం కేసీఆర్‌ దృష్టికి వచ్చింది. నల్గొండ ప్రాంతంలో గొర్రెల కాపరిగా జీవిస్తున్న నీల నరసింహ.. తన పాటలు, కవితలతో ప్రజలను చైతన్య పరచడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. సమాజాన్ని చైతన్యపరిచే విధంగా సమకాలీన అంశాలపై పాటలు, కవితలు రాయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. కవులు, కళాకారులను కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ గొర్రెల కాపరి రాసిన కవిత సీఎంను బాగా ఆకర్షించింది. దీంతో నరసింహను హైదరాబాద్ వచ్చి కలవమని సీఎం కోరారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ప్రగతి భవన్‌కు వచ్చిన నరసింహ కేసీఆర్‌కు ఆ కవిత చదివి వినిపించాడు. దీనికి సీఎం మెచ్చుకొని నరసింహను ప్రశంసించారు.
Samayam Telugu cm kcr impressed by a poem of herdboy narasimha
గొర్రెల కాపరి కవితకు కేసీఆర్ ప్రశంస!


సీఎం మెచ్చిన కవిత ఇదే..

వాడండి వాడండి జలం
అదుపు చేయండి చేయండి జలం
పొదుపు పెంచండి భూగర్భ జలం
లేదంటే ఏల బతకగలం.
జీవకోటికి ఈ జలమే మూలం
కాదంటే జీవితం గందరగోళం
ఓ.. మనిషీ నువు తీయాలి కాసింత
ఇంటి ముందు ఇంకుడుగుంత
అన్నీ తెలిసి నువు చేసేది రవ్వంత
చెప్పేది కొండంత.

నీరు విలువ తెలుసుకో
నీరు నిలువ చేసుకో
నీటితోనే భూతల్లి నిత్యం బాలింత
నీరు వృథా చేస్తే.. బాధలే బతుకంతా
సుజలాలతోనే మనకు మెతుకు కలగనుంది
సుఫలాలతోనే మన బతుకు వెలగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.