యాప్నగరం

నాటిన ప్రతి మొక్కా ఎదిగేలా చర్యలు..

ఎల్‌ఎండీ కట్ట దిగువన సీఎం.. ‘మహాగని’ మొక్కను నాటారు..

TNN 12 Jul 2017, 1:09 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం (జులై 12) కరీంనగర్‌ జిల్లాలోని దిగువ మానేరు డ్యామ్‌ వద్ద కేసీఆర్‌ మొక్కను నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎర్రవల్లి గ్రామం నుంచి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు, ప్రజలు అలగనూరు వద్ద ఘన స్వాగతం పలికారు. ఎల్‌ఎండీ కట్ట దిగువన కేసీఆర్.. ‘మహాగని’ మొక్కను నాటారు. నాటిన ప్రతి మొక్కనూ ఎదిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన కరీంనగర్ కలెక్టరేట్‌కు వెళ్లారు.
Samayam Telugu cm kcr inaugurates 3rd phase haritha haram in karimnagar
నాటిన ప్రతి మొక్కా ఎదిగేలా చర్యలు..


మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 24 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

అయిదేళ్లలో మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2015లో వర్షాభావ పరిస్థితుల వల్ల 16.49 కోట్ల మొక్కలే నాటారు. 2016లో 32.61 కోట్ల మొక్కలు నాటారు. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మొక్కలను నాటడంతోనే సరిపెట్టకుండా సంరక్షణ చర్యలు కూడా చేపట్టామని అధికారులు చెబుతున్నారు. మొక్కలకు సేఫ్‌గార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, వర్షాలు కురవని సమయాల్లో ఫైర్ ఇంజన్ల సాయంతో నీటిని అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ నాటిన మొక్కల్లో 80 శాతం వరకు సజీవంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.