యాప్నగరం

పాలేరుకు కదలి వచ్చిన కృష్ణమ్మ

ఈ ప్రాజెక్టుతో పాలేరు నియోజకవర్గంలోని సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు ప్రారంభంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TNN 31 Jan 2017, 4:32 pm
పాలేరు నియోజకవర్గ ప్రజల వర ప్రసాదమైన భక్తరామదాసు ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జాతికి అంకితం చేశారు. సీఎం స్వీచ్ ఆన్ చేసి నీటిని కిందకు వదిలారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇరిగేషన్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 11 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుతో పాలేరు నియోజకవర్గంలోని సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు ప్రారంభంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu cm kcr inaugurates bhakta ramadasu lift irrigation project
పాలేరుకు కదలి వచ్చిన కృష్ణమ్మ



రూ.335కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం 128 ఎకరాల భూసేకరణ చేసి.. పదహారున్నర కిలోమీటర్ల దూరం పైపులైన్ వేశారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సుమారు 60వేల ఎకరాలకు సాగునీరందనుంది. తిరుమలాయపాలెంలో 16వేల 286 ఎకరాలు, కూసుమంచి మండలంలో 23వేల 418ఎకరాలు, ఖమ్మం రూరల్ లో 12వేల 605ఎకరాలకు, ముదిగొండలో 2వేల 440 ఎకరాలు, నేలకొండపల్లి మండలంలో 2వేల 959 ఎకరాలు, డోర్నకల్ మండలంలో 12వందల 20 ఎకరాలకు సాగునీరు పారనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.