యాప్నగరం

గట్టు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన..!

జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం (జూన్ 29) శంకుస్థాపన చేశారు. రూ.553.98 కోట్ల అంచనా వ్యయంతో 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేయాలన్న ధ్యేయంతో గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

Samayam Telugu 29 Jun 2018, 4:31 pm
జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం (జూన్ 29) శంకుస్థాపన చేశారు. రూ.553.98 కోట్ల అంచనా వ్యయంతో 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేయాలన్న ధ్యేయంతో గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 41 చెరువులను నింపనున్నారు. 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తున్నారు.
Samayam Telugu gattu


ఇందుకోసం రేపంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి సుమారు 4 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఇందుకు గట్టు మండలం ఆలేరు పరిధిలో రెండు పంప్‌హౌజ్‌లను నిర్మిస్తారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కింద రిజర్వు చేసిన 5 వేల ఎకరాలకు దీనిద్వారా సాగునీరు అందనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.