యాప్నగరం

గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్‌ నరసింహన్‌‌తో ఆదివారం (జులై 22) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం, కంటి వెలుగు కార్య‌క్ర‌మాల గురించి గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్ వివ‌రించారు.

Samayam Telugu 22 Jul 2018, 7:46 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్‌ నరసింహన్‌‌ను ఆదివారం (జులై 22) కలిశారు. ఈ సందర్భంగా ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం, కంటి వెలుగు కార్య‌క్ర‌మాల గురించి గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్ వివ‌రించారు. ఆగస్టు 14 అర్థరాత్రి నుంచి ఇంటింటికీ మంచినీరు ఇవ్వనున్న నేపథ్యంలో.. 'మిషన్ భగీరథ' పథకంపైనా భేటీలో చర్చించారు. ఆగ‌స్టు 15న 'కంటివెలుగు' కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వంలో పాల్గొనాల‌ని కేసీఆర్ గవర్నరుకు విజ్ఞ‌ప్తి చేశారు.
Samayam Telugu కేసీఆర్


పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం, పరిపూర్ణానంద బహిష్కరణ అంశాలతోపాటు.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా ప‌రిణామాల‌పైనా ఇరువురి మధ్య చర్చ జరిగింది. గవర్నరుతో భేటీ అనంతరం.. ఇటీవ‌ల ఉమ్మ‌డి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రాధాకృష్ణ‌న్‌ను ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.