యాప్నగరం

దేశంలోనే ధనికులుగా తెలంగాణా యాదవులు: కేసీఆర్

రానున్న రెండేళ్లలో 88 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి తెలిపారు.

Samayam Telugu 11 Mar 2017, 5:17 pm
తెలంగాణలో 30 లక్షల మంది యాదవులున్నారనీ, వారిలో 4 లక్షల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లను ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. రానున్న రెండేళ్లలో 88 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా పక్క రాష్ర్టాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. రెండేళ్లలో ఈ గొర్రెల సంఖ్య 4 కోట్లకు చేరుతుందనీ, ఒక్కో గొర్రెకు రూ. 5 వేల చొప్పున లెక్కేసినా రూ. 20 వేల కోట్ల విలువ చేసే గొర్రెలు మన రాష్ట్రంలో ఉంటాయని ఆయన వివరించారు. ఈ రకంగా తెలంగాణ యాదవులకు దేశంలోనే ధనికులుగా గుర్తింపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణకు పక్క రాష్ర్టాల నుంచి రోజూ 600 లారీల గొర్రెలు వస్తున్నాయని ఆయన వివరించారు.
Samayam Telugu cm kcr plans to grant 5400 sheep units with 75 subsidy in telangana
దేశంలోనే ధనికులుగా తెలంగాణా యాదవులు: కేసీఆర్


గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ బిల్లులను ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పాస్ చేయబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయి తప్ప.. వారి సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.