ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో రూ. 43000 కోట్ల వ్యయంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్లో ఈ పథకం పురోగతిపై ఆయన గురువారం (ఆగస్టు 24) మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయననే సవాల్ తీసుకుని ఈ పనులు చేస్తున్నాం.. దానికి తగినట్లు పని చేయాలి. సకాలంలో పనులు పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి ప్రజలకు మంచినీరు అందించాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మిషన్ భగీరథ పథకం ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని.. లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు రేయింబవళ్లు పని చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా మిషన్ భగీరథ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన చెప్పారు. తాను కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పథకం పనులు పరిశీలిస్తానని తెలిపారు.
మిషన్ భగీరథ పథకం ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని.. లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు రేయింబవళ్లు పని చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా మిషన్ భగీరథ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన చెప్పారు. తాను కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పథకం పనులు పరిశీలిస్తానని తెలిపారు.