ఇంటర్ ఫలితాల వివాదం.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఫెయిలైన విద్యార్థులకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉచితంగా నిర్వహించాలని ఆదేశించారు.
Samayam Telugu 24 Apr 2019, 6:45 pm
ప్రధానాంశాలు:
- ఇంటర్ బోర్డు నిర్వాకంపై స్పందించిన సీఎం.
- విద్యా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష.
- సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు ప్రకటించిన కేసీఆర్.
రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై బుధవారం (ఏప్రిల్ 24) సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం విషయంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వివాదాలకు తావు లేకుండా అన్ని రకాల పరీక్షల నిర్వహణకు స్వతంత్య్ర సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని.. దీనిపై త్వరలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు కొంత మంది ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా పేర్కొన్నారు. ఇంటర్లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని.. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
నీట్, జీఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి.. ఫలితాలు వెల్లడించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
‘ఇంటర్తో పాటు ఎంసెట్ తదితర పరీక్షల విషయంలో ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయన చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్తో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ అంశాన్ని పర్యవేక్షించాలని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరవగా.. 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరికీ ఉచితంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించిన విద్యార్థులకు సొమ్ము తిరిగి చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల ఆత్మహత్యలపైనా కేసీఆర్ స్పందించారు. ఆత్మహత్యలు బాధాకరం అన్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ అందిస్తున్న సంస్థ సామర్థ్యంపైనా సీఎం ఆరా తీసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే టెండర్కు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు కొంత మంది ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా పేర్కొన్నారు. ఇంటర్లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని.. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
నీట్, జీఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి.. ఫలితాలు వెల్లడించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
‘ఇంటర్తో పాటు ఎంసెట్ తదితర పరీక్షల విషయంలో ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయన చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్తో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ అంశాన్ని పర్యవేక్షించాలని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరవగా.. 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరికీ ఉచితంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించిన విద్యార్థులకు సొమ్ము తిరిగి చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల ఆత్మహత్యలపైనా కేసీఆర్ స్పందించారు. ఆత్మహత్యలు బాధాకరం అన్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ అందిస్తున్న సంస్థ సామర్థ్యంపైనా సీఎం ఆరా తీసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే టెండర్కు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.