యాప్నగరం

కోతలు లేని కరెంట్ వెనుక ఉద్యోగుల కృషి

రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్‌ కోతల సమస్యను అధిగమించడం వెనుక ఎంతో కృషి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

TNN 27 Mar 2017, 5:37 pm
రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్‌ కోతల సమస్యను అధిగమించడం వెనుక ఎంతో కృషి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు రోజంతా పని చేయడం వల్లే ప్రస్తుతం కోతలు లేని కరెంట్‌ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. గతంలో విద్యుత్‌ కోసం పరిశ్రమ వర్గాలు, రైతులు ఎంతో ఆందోళన చేశారని సీఎం గుర్తు చేశారు. రెండున్నరేళ్లలో విద్యుత్‌‌ను మెరుగుపర్చడానికి రూ.12,136 కోట్లు ఖర్చు చేశామని, కాంగ్రెస్‌ హయాంలోని అంధకారాన్ని తొలగించి విద్యుత్‌ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu cm kcr talks in telangana assembly
కోతలు లేని కరెంట్ వెనుక ఉద్యోగుల కృషి


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని నిర్ధారణకు వచ్చిన తర్వాతే రెండు పడక గదుల ఇళ్ల ప్రకటన చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘సంక్షేమ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. గత 60 ఏళ్ల కాలంలో బీడీ కార్మికులను ఎవరూ పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చాక 3.7 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళలకు జీవన భృతి కల్పిస్తున్నాం. పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి, రూ.75,000 చొప్పున ఇస్తున్నాం. రైతులకు రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశాం. వసతిగృహాల్లో సన్నబియ్యం ప్రవేశపెట్టాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.