యాప్నగరం

‘ధర్నాలు ఎక్కడ చేస్తే ఏంటి?’: కేసీఆర్

ధర్నాచౌక్‌ మార్పుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆసక్తికరంగా స్పందించారు..

TNN 12 Apr 2017, 11:22 pm
ధర్నాచౌక్‌ మార్పుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆసక్తికరంగా స్పందించారు. ‘నిరసన చేసే హక్కు అందరికీ ఉంటుంది. నిజానికి అది ప్రజాస్వామ్యానికి అందం కూడా. కానీ, ఆ పేరుతో ప్రజలకు అతి అసౌకర్యం కలిగించకూడదు. గతంలో ధర్నాచౌక్‌‌గా.. ప్రస్తుత లుంబినీ పార్కు ప్రాంతం ఉండేది. ఆ తర్వాత ఇందిరాపార్కు వద్దకు మారింది. ఇప్పుడు అక్కడి స్థానికులు, వాకర్స్ ఇందిరాపార్క్ నుంచి ధర్నా చౌక్‌ను మార్చాలంటూ కోర్టులో పిల్ వేశారు. కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ.. రక్తాలు కారినా ధర్నా చేస్తాం అంటూ తేదీలు ప్రకటిస్తున్నారు. ఈ రక్తాలు కారుడెందుకు? అసలు ఈ ధర్నాలు ఎక్కడ చేస్తే ఏంటీ?’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu cm kcr talks on dharna chowk
‘ధర్నాలు ఎక్కడ చేస్తే ఏంటి?’: కేసీఆర్


ఈ రోజుల్లో ధర్నాలు ఎక్కడ చేసినా ఒకటే.. ప్రతిపక్షాలు ఎక్కడ ధర్నాలు చేస్తే.. అక్కడికి మీడియా వస్తూనే ఉంది. వాళ్లకు కావాల్సింది సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవడమే కదా.. అని సీఎం అన్నారు. నిజానికి ధర్నా చౌక్ మార్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం పోలీసుల దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. శాసనసభకు, సచివాలయానికి దూరంగా ధర్నాలు చేపట్టాలని ఆయన చెప్పారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు నగరంలో నాలుగైదు ప్రాంతాలు గుర్తించి.. కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు సూచించినట్లు సీఎం చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బహిరంగ సభల వేదికలను కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.