యాప్నగరం

అందుకే పాటలు రాయాల్సి వచ్చింది: కేసీఆర్

సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు. శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.

TNN 13 Nov 2017, 1:59 pm
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు. శాసనసభలో సోమవారం (నవంబర్ 13) రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకే వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu cm kcr talks on farmers issues in ts assembly
అందుకే పాటలు రాయాల్సి వచ్చింది: కేసీఆర్


‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ గతి ఏమైందో సభ్యులందరికీ తెలుసు. పల్లెల దుస్థితిపై కవులు పాటలు రాయాల్సి వచ్చింది. పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే.. లాంటి పాటలు ఉట్టిగ రాయలేదు. పాలమూరు రైతులు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కరీంనగర్‌లో 65 శాతం వ్యవసాయం బోర్లపైనే ఆధారపడి ఉంది’ అని కేసీఆర్ అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదని కేసీఆర్ అన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు ఆయన సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.