యాప్నగరం

‘కేజీ టు పీజీ’ ఓ ప్రతిష్టాత్మక పథకం: కేసీఆర్

‘కేజీ టు పీజీ - ఉచిత విద్య’ కార్యక్రమాన్ని డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

TNN 27 Mar 2017, 4:25 pm
‘కేజీ టు పీజీ - ఉచిత విద్య’ కార్యక్రమాన్ని డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా విధానం అమలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆయన తెలిపారు. దీన్ని పూర్థి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన వివరించారు. ఈ దిశగా పటిష్టమైన ముందడుగు వేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని అయన తెలిపారు. ఎస్సీ విద్యార్థినుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu cm kcr talks on kg to pg free education in ts assembly
‘కేజీ టు పీజీ’ ఓ ప్రతిష్టాత్మక పథకం: కేసీఆర్


త్వరలో గురుకులాల్లో 24 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నామని సీఎం ప్రకటించారు. గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలిపారు. ‘టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 50 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించడం గత పాలకుల వైఫల్యం కాదా?’ అని ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిష్ విద్య అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.