తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారికి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన శ్రీవారికి మొక్కుకున్నారని, ఆ మొక్కునే ఇప్పుడు తీర్చుకోనున్నారనని సన్నిహితులు చెబుతున్నారు. 18 కిలలో బంగారంలో సాలగ్రామ హారం, ఇతర కంఠాభరణాలు తయారు చేయించారు. ఇవన్నీ కోయంబత్తూరులోని బంగార ఆభరణాల తయారీదారుల వద్ద చేయించారు. వీటి విలువ అయిదున్నకోట్ల రూపాయలు. వీటిని జనవరి 31న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన అందజేయనున్నారు.
తిరుమల శ్రీవారికి కేసీఆర్ భారీ కానుక
సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారికి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు సమర్పించుకోనున్నారు.
TNN 28 Jan 2017, 4:07 pm