యాప్నగరం

చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్

ఆశ్రమంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం.. చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్..

Samayam Telugu 10 Nov 2018, 8:44 pm
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిశారు. శనివారం సీఎం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండంలోని శ్రీరామనగరంలో ఉన్న దివ్య సాకేతాన్ని సందర్శించారు. చిన జీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో జరిగిన నక్షత్ర మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Samayam Telugu kcr


హోమం, ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్‌ చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం వెంట ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. కేసీఆర్ రాకతో.. శ్రీరామనగరం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.