తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేసీఆర్.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం సుమారు రూ.800 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానాలయం, పెద్దగుట్ట టెంపుల్, గోపురాలు, శివాలయం, మాఢ వీధులను పరిశీలించిన కేసీఆర్.. యాదాద్రి అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ పర్యటన అనంతరం కేసీఆర్.. భువనగిరిలో టీఆర్ఎస్వీ నాయకుడు తుంగ బాలు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
శుక్రవారం (నవంబర్ 24) ఉదయం సీఎం కేసీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట చేరుకున్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
శుక్రవారం (నవంబర్ 24) ఉదయం సీఎం కేసీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట చేరుకున్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.