యాప్నగరం

కూలిపని చేయబోతున్న సీఎం కేసీఆర్

తెరాస పదహారో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది పార్టీ.

TNN 17 Apr 2017, 9:48 am
తెరాస పదహారో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది పార్టీ. ఇందుకు అయ్యే ఖర్చును తెరాస నేతలు కూలిపనులు చేసి సంపాదించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ కార్యక్రమానికి ‘గులాబీ కూలీ దినాలు’ అని పేరు పెట్టారు. ఇందులో భాగంగానే కేటీఆర్ మొన్న ఐస్ క్రీములు అమ్మారు. మంత్రులు కొందరు మట్టి తట్టలు మోశారు. ఎమ్మెల్యేలు కూడా వివిధ రకాల పనులు చేస్తూ డబ్బులు సేకరిస్తున్నారు. త్వరలో సీఎం కేసీఆర్ కూడా కూలీగా అవతారం ఎత్తనున్నారు. అందుకు పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అలాగే పాలకుర్తి మండలంలోని బమ్మెర, రాఘవపురం గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు.
Samayam Telugu cm kcr will do coolie work for party
కూలిపని చేయబోతున్న సీఎం కేసీఆర్


ఆదివారం అసెంబ్లీ సమావేశాల సమయంలో పాలకర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కాసేపు విలేకరులతో మాట్లాడారు. వరికోతల సమయం కాబట్టి... వరి కోసే పనిని కేసీఆర్ చేత చేయించనున్నామని చెప్పారు. అయితే ఆ పనికి రైతుల దగ్గర నుంచి మాత్రం రూపాయి కూడా తీసుకోమని చెప్పారు. వ్యాపారస్తుల దగ్గర నుంచి సీఎం కూలి పనికి డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. కేసీఆర్ కూలిపనికి రూ.20 లక్షల వరకు డబ్బు వచ్చేలా ప్రణాళిక వేసినట్టు చెప్పారు. అనంతరం కేసీఆర్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.