యాప్నగరం

కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీని కలిసేందుకు రావాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిల పక్షానికి లేఖ రాశారు.

TNN 3 Feb 2017, 6:53 pm
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీని కలిసేందుకు రావాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిల పక్షానికి లేఖ రాశారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఎంఐఎం పార్టీలకు ఆయన రాసిన లేఖలు చేరాయి. లేఖలో ఫిబ్రవరి అయిదో తేదీన అన్ని పార్టీల నేతలు ఢిల్లీకి చేరుకోవాలని ఆయన కోరారు. కాగా లేఖ రాయడానికి ముందే కేసీఆర్‌కు మోడీ అపాయింట్‌మెంట్ కన్ఫర్మ్ అయ్యింది.
Samayam Telugu cm kcr will meet pm modi on sc division
కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం


ఎస్సీ వర్గీకరణను కేంద్రం వెంటనే చేపట్టాలని కోరడానికి అఖిలపక్షంతో కలిసి మోడీని కలిసేందుకు కేసీఆర్ అంతా సిద్ధం చేశారు. అందుకు ముందుగానే ప్రధాని అపాయింట్ మెంట్ ను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం అపాయింట్ మెంట్ ఖరారైంది. దీంతో వెంటనే అన్ని పార్టీలకు లేఖలు రాసి కలిసిరావాలని కోరారు కేసీఆర్. ఫిబ్రవరి 6వ తేదీన కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం మోడీని కలుస్తుంది. ఎస్సీ వర్గీకరణపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరనుంది. ముందుగానే వర్గీకరణపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం చేశారు. ఆ తీర్మానం కాపీని కూడా మోడీకి ఇవ్వనున్నారు. కేసీఆర్ అయిదో తేదీనే ఢిల్లీ చేరుకుని అక్కడ పలువురు నేతలతో భేటీ కానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.