యాప్నగరం

ప్రధాని మోడీకి లేఖ రాసిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్.. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యంహంకార దాడుల గురించి..

TNN 18 Mar 2017, 8:30 pm
ముఖ్యమంత్రి కేసీఆర్.. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యంహంకార దాడుల గురించి ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నించాలని ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ఈ మేరకు ప్రధానికి సీఎం ఒక లేఖ రాశారు. ఇటీవల అమెరికాలో జరుగుతున్న దురదృష్టకర సంఘటల గురించి కేసీఆర్.. ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్, వరంగల్‌కు చెందిన వంశీ చందర్ రెడ్డి హత్యల గురించి తెలిపారు.
Samayam Telugu cm kcr writes a letter to pm modi
ప్రధాని మోడీకి లేఖ రాసిన కేసీఆర్


భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వారిపై దాడులు జరుగుతుండటంతో.. ఇక్క‌డ వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. దాడుల వ‌ల్ల అమెరికాపై విశ్వాసం తగ్గుతోందని, అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో పాటు భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవాస భారతీయులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.