యాప్నగరం

జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి సీఎం కేసీఆర్, జగన్ నివాళి

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి పార్థీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు నివాళులు అర్పించారు.

Samayam Telugu 1 May 2019, 6:46 pm
నారోగ్యంతో కన్నుమూసిన జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
Samayam Telugu Justice


బుధవారం మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని అవంతినగర్‌లో ఉన్న జస్టిస్ సుభాషణ్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సుభాషణ్ రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉన్నారు.

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుభాషణ్ రెడ్డి నెల రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.