యాప్నగరం

స్నేహితుడి మృతిని తట్టుకోలేకపోయిన సీఎం కేసీఆర్

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న దానయ్య ముస్తాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం...

Samayam Telugu 26 Jun 2017, 9:15 pm
సిద్ధిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆస దానయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న దానయ్య ముస్తాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దానయ్యతో సీఎం కేసీఆర్‌కి మంచి అనుబంధం వుంది.
Samayam Telugu cm kcrs condolences to his friend danaiah
స్నేహితుడి మృతిని తట్టుకోలేకపోయిన సీఎం కేసీఆర్


సీఎం కేసీఆర్‌తో అత్యంత చనువు కలిగిన అతికొద్ది మందిలో దానయ్య ఒకరు. అటువంటి దానయ్య తనకి భౌతికంగా దూరమవడంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా దానయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి దానయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

1987లో కేసీఆర్ సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దానయ్యకు అవకాశం కల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానంలో ఓ దళితుడిని నియమించడం అదే మొదటిసారి అని పరిశీలకులు చెబుతుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.