యాప్నగరం

విశాఖపట్నంలో ఇండియన్ నేవి అవార్డ్స్ వేడుక

ఏడాదికి ఓసారి ఇండియన్ నేవీ నిర్వహించే నేవల్ ఇన్వెస్టిచర్ సెరెమనీని ఈసారి విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లోని...

Samayam Telugu 20 Apr 2017, 11:16 pm
ఏడాదికి ఓసారి ఇండియన్ నేవీ నిర్వహించే నేవల్ ఇన్వెస్టిచర్ సెరెమనీని ఈసారి విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లోని కమాండ్ పరేడ్ గ్రౌండ్‌లో ఏప్రిల్ 20న జరిగాయి. అడ్మిరల్ సునీల్ లంబ, పీవీఎస్ఎం, ఎవీఎస్ఎం, ఏడీసీ, నేవల్ స్టాఫ్ చీఫ్ ఈ సెరెమనీలో పాల్గొని భారత రాష్ట్రపతి తరపున విజేతలకి గ్యాలంట్రీ, నాన్-గ్యాలంట్రీ అవార్డులు అందజేశారు. పరేడ్ గ్రౌండ్ వద్ద వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ స్వయంగా ఎదురెళ్లి అడ్మిరల్ సునీల్ లంబకి స్వాగతం పలికారు. 50 మంది సాయుధులైన బలగాల బృందాన్ని తనిఖీ చేసిన నేవీ స్టాఫ్ చీఫ్ అనంతరం వారితో సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu cns honours award winners at naval investiture ceremony
విశాఖపట్నంలో ఇండియన్ నేవి అవార్డ్స్ వేడుక


ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నేవి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన అడ్మిరల్ లంబ... వృత్తి, విధుల పట్ల అంకిత భావం, శౌర్య సాహసాలు ప్రదర్శించిన సిబ్బందికి తగిన విధంగా గుర్తింపునివ్వడమే ఈ కార్యక్రమానికి వున్న ప్రత్యేకత అని అన్నారు. అవార్డులు గెలుచుకున్న నేవి సిబ్బంది కుటుంబాలకి కూడా అడ్మిరల్ లంబ కృతజ్ఞతలు తెలిపారు. ఇంట్లో కుటుంబసభ్యుల నుంచి సహకారం లేనిదే సిబ్బంది తమ విధుల్లో అంత ఏకాగ్రత ప్రదర్శించలేరని అడ్మిరల్ అభిప్రాయపడ్డారు. విధుల పట్ల అంకిత భావం, పోరాడేతత్వం, సాహసం, దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీలే వారికి ఈ విజయాన్ని అందించాయని విజేతలని ప్రశంసించారు అడ్మిరల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.