యాప్నగరం

కలెక్టర్లు పోటీపడి పని చేయాలి: సీఎం కేసీఆర్

అభివృద్ధి కార్యక్రమాల అమలులో కలెక్టర్లు పోటీపడి పని చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు.

Samayam Telugu 14 Dec 2016, 2:44 pm
అభివృద్ధి కార్యక్రమాల అమలులో కలెక్టర్లు పోటీపడి పని చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. బుధవారం ప్రగతి భవన్‌లో తొలిసారిగా 31 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.30వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతూ దేశంలో మనమే నెంబర్ వన్‌గా నిలిచామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరేలా సమర్థవంతంగా అమలు చేసేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
Samayam Telugu collectors should compete with others in implementing development
కలెక్టర్లు పోటీపడి పని చేయాలి: సీఎం కేసీఆర్


పథకాలు ప్రవేశపెట్టడం వరకే పరిమితం కాకుండా వాటిని ప్రజల్లో మార్పు తెచ్చేందుకు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్నారు.

టీఎస్‌ఐపాస్ చట్టం వల్ల 2500 పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేసిన కేసీఆర్...నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించాలని..ఇందుకు టీవాలెట్ కూడా త్వరలోనే అందుబాటులో తెస్తామని చెప్పారు.

పేకాట, గుడుంబా వంటి అరికట్టగలిగామని... గుడుంబా తయారీ మానేసిన కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రులు, కలెక్టర్లకు సూచించారు.
అత్యవసర వినియోగానికి ప్రతి జిల్లాకు రూ.3కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.