యాప్నగరం

దుండిగ‌ల్ అకాడ‌మీలో ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైయింగ్ ఆఫీసర్స్ ఎంతో ఉత్సాహంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నారు. వారి విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

Samayam Telugu 15 Dec 2018, 8:03 pm
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియాన్ ఆర్మీ చీఫ్, జనరల్ బిపిస్ రావత్ హాజరయ్యారు. 139 క్యాడెట్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పైలట్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైన రావ‌త్‌ శిక్షణ పొందిన పైలట్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
Samayam Telugu Parade at Dundigal


See Pics: మరిన్ని ఫొటో కోసం క్లిక్ చేయండి

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైయింగ్ ఆఫీసర్స్ ఎంతో ఉత్సాహంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నారు. ట్రైనీల కుటుంబసభ్యులు, బంధువులు సైతం ఈ కార్యక్రమానికి హాజరై పైలట్లలో నూతన ఉత్సాహాన్ని నింపారు.


కాగా, బిపిన్ రావత్ రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 14న సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్యం ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులు అందుకున్నారు.
See Pics: మరిన్ని ఫొటో కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.