యాప్నగరం

జగన్ పాదయాత్రలో కమెడియన్ పృథ్వీ

వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు మద్దతు తెలిపారు టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం దగ్గర వైసీపీ అధినేతను కలిసి పాదయాత్రకు తన సంఘీభావాన్ని తెలిపారు.

Samayam Telugu 29 May 2018, 7:18 pm
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు మద్దతు తెలిపారు టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం దగ్గర వైసీపీ అధినేతను కలిసి పాదయాత్రకు తన సంఘీభావాన్ని తెలిపారు. జగన్ చేతిలో చెయ్యేసి.. వైసీపీ జెండాను భుజాన పెట్టుకొని ముందుకు అడుగులు వేశారు. తర్వాత నేతలతో పాటూ స్థానికులతో కాసేపు ముచ్చటించి సరదాగా గడిపారు. ప్రజా సంకల్ప యాత్రకు అపూర్వ స్పందన వస్తుందని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు పృథ్వీ. తాను చూసిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గొప్పవాళ్లన్నారు. అదేబాటలో జగన్ కూడా మంచి పాలన అందిస్తారనే నమ్మకం ఉందన్నారు.
Samayam Telugu Prudhvi Raj


జగన్ పాదయాత్రకు ఇటీవలే నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కూడా మద్దతు పలికారు. ఇప్పుడు పృథ్వీ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. ఈయన కొద్ది నెలల క్రితం విజయవాడలో జగన్‌ను కలిశారు.. ఆయనపై ప్రశంసలు కూడా కురిపించారు. అవసరమైతే పార్టీ తరపున ప్రచారానికి సిద్ధమనే సంకేతాలు కూడా పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.