యాప్నగరం

సన్నాసులే రాద్ధాంతం చేస్తున్నారు: కేసీఆర్

దేవుళ్లకు మొక్కులు సమర్పించే విషయాన్ని కొందరు సన్నాసులు రాద్ధాంతం, రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ

Samayam Telugu 24 Feb 2017, 3:11 pm
దేవుళ్లకు మొక్కులు సమర్పించే విషయాన్ని కొందరు సన్నాసులు రాద్ధాంతం, రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. కాలం చెల్లిన కమ్యూనిస్టు నాయకులే తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Samayam Telugu communist parties out dated says kcr
సన్నాసులే రాద్ధాంతం చేస్తున్నారు: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొక్కులు చెల్లించుకుంటాని తాను ముందే మొక్కానని..ఇప్పుడు ఆ మొక్కులు తీర్చుకుంటున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలంగా మార్చడమే తమ ధ్యేయమని చెప్పిన కేసీఆర్..కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాకు నీటి అవసారాలు తీరుస్తామని చెప్పారు.

40ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నేతలు తెలంగాణకు చేసిందేమీ లేదని...కాంగ్రెస్ కల్చర్ అంతా చీప్ లిక్కర్ల కల్చర్ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆపార్టీ నేతలవి బానిస బతుకులని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఓ దొంగల ముఠా తయారైందని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.