యాప్నగరం

రేవంత్, పొన్నం ప్రభాకర్‌లకు కీలక పదవులు

ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఎలక్షన్, క్యాంపెయిన్, మ్యానిఫెస్టో లాంటి మూడు కమిటీలలో అవకాశం కల్పించడం గమనార్హం.

Samayam Telugu 19 Sep 2018, 8:01 pm
తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తమ కసరత్తులు ముమ్మరం చేసింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 9 కీలక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు, వాటి వివరాలను ఢిల్లీలో ఏఐసీసీ ప్రతినిధి అశోక్ గెహ్లాట్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత రేవంత్ రెడ్డి సహా పొన్నం ప్రభాకర్‌లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. 53 మందితో కో ఆర్డినేషన్ కమిటీ, 15 మందితో కోర్ కమిటీ, 41 మందితో ఎన్నికల కమిటీలను నియమించారు.
Samayam Telugu Revabth Reddy And Ponnam Prabhakar


ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఎలక్షన్, క్యాంపెయిన్, మ్యానిఫెస్టో లాంటి మూడు కమిటీలలో అవకాశం కల్పించడం గమనార్హం. అయితే ఆ 3 కమిటీలు సైతం కీలక కమిటీలు, ప్రాధాన్యం ఉన్నవి కావడాన్ని కొందరు సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరకముందే కమిటీల నిర్ణయం జరిగిపోయిందని తెలుస్తోంది.

మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా ఆర్.సి.కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్, కో కన్వీనర్‌గా డీకే అరుణ, స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా వి.హనుమంతరావు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కోదండరెడ్డిలను కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.