యాప్నగరం

వీడియో: కూలిన వేదిక.. విజయశాంతికి తప్పిన ప్రమాదం

విజయశాంతికి ప్రమాదం తప్పింది. అచ్చంపేటలో ఆమె పాల్గొన్న కాంగ్రెస్ సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Samayam Telugu 12 Oct 2018, 7:27 pm
కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. పార్టీ నేతలు విజయశాంతి, మల్లు భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య తదితర నాయకులకు ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం (అక్టోబర్ 12) మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వేదికపై పార్టీ ముఖ్య నాయకులంతా ఆశీనులై ఉన్నారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.
Samayam Telugu vijayashanthi


అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు రాములమ్మను పైకి లేపారు. ఈ ఘటనలో కాంగ్రెస్‌ నేతలంతా క్షేమంగా బయటపడ్డారు. విజయశాంతితో పాటు పార్టీ నేతలందరినీ సురక్షితంగా అక్కడ నుంచి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం, నేతలంతా ఒక్కసారిగా వేదికపైకి చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విజయశాంతి షో ఎప్పుడో ఫ్లాప్: నాయిని
విజయశాంతి షో ఎప్పుడో ఫ్లాప్ అయిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపి టీడీపీ.. కాంగ్రెస్‌తో కలిసిపోయిందని విమర్శించారు. టీడీపీ వాళ్లు కాంగ్రెస్‌తో కలిస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. నల్గొండలో శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.