యాప్నగరం

తెలంగాణలో రాహుల్ ప్రచారానికి షెడ్యూలు ఖరారు

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌.. రాహుల్ పొల్గొనే సభా స్థలాలను అక్టోబర్ 15న పరిశీలిస్తారని సమాచారం.

Samayam Telugu 14 Oct 2018, 7:38 pm
అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తులు ముమ్మరం చేసింది. ఓవైపు పార్టీలో ఫ్యామిలీకి రెండు సీట్లు అనే వివాదం, మరోవైపు మహాకూటమిలో భాగంగా సీట్ల పంపకాలు ఖరారు చేయకున్నా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పార్టీ ప్రచారం కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. తెలంగాణలో రాహుల్ పర్యటన కార్యక్రమాల వివరాలను పార్టీ నేతలు వెల్లడించారు.
Samayam Telugu Rahul Gandhi


అక్టోబర్ 20న ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనేందుకు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు ఆ రోజు ఉదయం 10.30నిమిషాలకు రాహుల్ శంషాబాద్‌ చేరుకోనున్నారు. నగరంలోని చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్‌ గాంధీ ‘సద్భావన యాత్ర’ సభలో రాహుల్ పాల్గొంటారు. సద్భావన యాత్రలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ‘రాజీవ్‌ గాంధీ సద్భావన స్మారక అవార్డు’ను అందజేసి సత్కరిస్తారు.

అదేరోజు మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బైంసాకు చేరుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కామారెడ్డిలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్టోబర్ 20వ తేదీ రాత్రే రాహుల్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన బైంసా, కామారెడ్డిలకు వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభా స్థలాలను, ఏర్పాట్లను పరిశీలిస్తారని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.