ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ తేల్చేసింది. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఒంటరి పోరేనని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పేశారు. కానీ వైసీపీ, జనసేనలతో పొత్తుకు సై అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ట్విస్ట్ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, జనసేనలతో పొత్తు సిద్ధమని మోహన్ చెబుతున్నారు. జగన్, పవన్లలో ఎవరైనా పొత్తుకు ఓకే అంటే.. కాంగ్రెస్ అధిష్టానంతో తాను మాట్లాడుతానన్నారు. జగన్ సిద్ధమంటే వైసీపీతో కాంగ్రెస్ పార్టీ కలసి పోటీ చేస్తుందని.. జగన్కు సీఎం పదవి ఇచ్చినా ఫర్వాలేదన్నారు.
పవన్ ఓకే అంటే జనసేనతోనైనా పొత్తుకు సిద్ధమన్నారు. జనసేనాని తమ పార్టీ నేత చిరంజీవి తమ్ముడే కదా.. అందుకే అడుగుతున్నామన్నారు. ఇది తన వ్యక్తిగత ఆలోచనని.. ఆ రెండు పార్టీలు పొత్తుకు ఓకే చెబితే అధిష్ఠానంతో చర్చిస్తానన్నారు. అలాగే టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవని మోహన్ అన్నారు. తెలంగాణాలో ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్లే దెబ్బ తిందన్నారు. ఏపీలో ఆ తప్పును చేయడానికి కాంగ్రెస్ సిద్దంగా లేదన్నారు.
పవన్ ఓకే అంటే జనసేనతోనైనా పొత్తుకు సిద్ధమన్నారు. జనసేనాని తమ పార్టీ నేత చిరంజీవి తమ్ముడే కదా.. అందుకే అడుగుతున్నామన్నారు. ఇది తన వ్యక్తిగత ఆలోచనని.. ఆ రెండు పార్టీలు పొత్తుకు ఓకే చెబితే అధిష్ఠానంతో చర్చిస్తానన్నారు. అలాగే టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవని మోహన్ అన్నారు. తెలంగాణాలో ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్లే దెబ్బ తిందన్నారు. ఏపీలో ఆ తప్పును చేయడానికి కాంగ్రెస్ సిద్దంగా లేదన్నారు.