యాప్నగరం

ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు.. అన్నీ తానై తలసాని..

Mukesh Goud Cremation | కాంగ్రెస్ నాయకుడు ముఖేష్ గౌడ్ అంత్యక్రియలను మంగళవారం షేక్‌పేట్‌లోని గౌడ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ముఖేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అంజలి ఘటించారు.

Samayam Telugu 30 Jul 2019, 9:16 pm
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ అంత్యక్రియలను మంగళవారం (జులై 30) సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ముఖేష్ గౌడ్ పెద్ద కుమారుడు విక్రమ్ గౌడ్ ఆయన మృత దేహానికి దహన సంస్కరాలు నిర్వహించారు. కొద్ది రోజులుగా కేన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఇంటి నుంచి ముఖేష్ గౌడ్ అంతిమ యాత్రను ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభించి, 11 గంటలకు జాంబాగ్‌లోని పాత ఇంటికి తీసుకెళ్లి కాసేపు భౌతిక కాయాన్ని కొద్ది సేపు అక్కడే ఉంచారు.
Samayam Telugu Mukesh 1


అంత్యక్రియలను పర్యవేక్షించిన మంత్రి తలసాని..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ముఖేష్ గౌడ్ పార్థివ దేహాన్ని గాంధీ భవన్‌కు తరలించారు. అక్కడ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు వీ హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజ నర్సింహ్మ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు నివాళులు అర్పించారు. ముఖేష్ గౌడ్‌ను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం షేక్‌పేట్‌లోని గౌడ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు ముగిసే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.