యాప్నగరం

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ దీక్ష: కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీలో మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పైకి హెడ్‌ఫోన్స్ ఘటనలో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై నిరసనగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో 48 గంటల దీక్ష చేపట్టారు.

Samayam Telugu 13 Mar 2018, 11:10 pm
తెలంగాణ అసెంబ్లీలో మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పైకి హెడ్‌ఫోన్స్ విసిరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం స్పీకర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో 48 గంటల దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరుతో చేపట్టిన ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Samayam Telugu congress legislators start deeksha against undemocratic action of govt
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ దీక్ష: కాంగ్రెస్


ఈ సందర్భంగా శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ప్రభుత్వం వెంటనే ఇద్దరు సభ్యుల సభ్యత్వం రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. చరిత్రలో ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడూ సస్పెండ్‌ చేయలేదని, సభ్యత్వాలే రద్దుచేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. బంగారు తెలంగాణా అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇది తమ సభ్యుల్ని కాపాడుకొనేందుకు చేపట్టిన దీక్ష కాదని, యావత్‌ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న దీక్ష అని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. లేకపోతే ప్రజాసమస్యలపై చర్చలు, పాసైన బడ్జెట్‌ ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరగవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో గానీ, ఇతర అసెంబ్లీల్లో గానీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ఘటనలు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.