యాప్నగరం

కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

Telangana Congress | సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. తన నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యలపైనే ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు.

Samayam Telugu 19 Jul 2019, 9:33 pm
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తన నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసినట్లు వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూ నిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ నది కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. శుక్రవారం (జులై 19) సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన అనతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu Rajgopal Reddy
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


డిండి ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే మునుగోడు నియోజకవర్గ భూ నిర్వాసితులకు నేటివరకు నష్ట పరిహారం అందలేదని సీఎం కేసీఆర్‌కు వివరించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శివన్నగూడెం, కృష్ణరాంపల్లి నిర్వాసితులకు కూడా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు అందించిన ప్యాకేజీనే అందించాలని కోరినట్లు వెల్లడించారు.

నల్గొండ, యాదాద్రి జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ను విజ్ఞప్తి చేసినట్టు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయసముద్రం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.