తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరకాటంలో పడ్డారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారు. సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్న గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేసి గాల్లోకి విసిరారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
ప్రసంగం అనంతరం పోడియం నుంచి గవర్నర్ నరసింహన్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వెళ్తుండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన హెడ్ఫోన్స్ వారిపైకి విసిరారు. అవికాస్త స్వామిగౌడ్ కంటికి తగిలాయి. దీంతో ఆయన కంటికి గాయమైంది. అక్కడే ఆయనకు ప్రథమ చికిత్స చేసి సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటోంది. రేపు సమావేశంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటోంది. ఇలాంటి సంఘటనలు చాలా అసెంబ్లీల్లో జరిగాయని, దీన్ని పెద్దదిగా చేసి చూపించడానికి టీఆర్ఎస్ పార్టీ డ్రామా ఆడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు.
వాస్తవానికి ఈ మధ్యకాలంలో అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య వాతావరణం బాగా వేడెక్కింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. విపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ తమ వ్యూహం ప్రకారమే బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రసంగం అనంతరం పోడియం నుంచి గవర్నర్ నరసింహన్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వెళ్తుండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన హెడ్ఫోన్స్ వారిపైకి విసిరారు. అవికాస్త స్వామిగౌడ్ కంటికి తగిలాయి. దీంతో ఆయన కంటికి గాయమైంది. అక్కడే ఆయనకు ప్రథమ చికిత్స చేసి సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటోంది. రేపు సమావేశంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటోంది. ఇలాంటి సంఘటనలు చాలా అసెంబ్లీల్లో జరిగాయని, దీన్ని పెద్దదిగా చేసి చూపించడానికి టీఆర్ఎస్ పార్టీ డ్రామా ఆడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు.
వాస్తవానికి ఈ మధ్యకాలంలో అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య వాతావరణం బాగా వేడెక్కింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. విపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ తమ వ్యూహం ప్రకారమే బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.