యాప్నగరం

టీడీపీతో పొత్తు వల్లే ఓడిపోయాం: విజయశాంతి

టీడీపీతో పొత్తు వల్ల కలిసిన నష్టాన్ని త్వరలోనే హైకమాండ్‌కు వివరిస్తానని విజయశాంతి తెలిపారు

Samayam Telugu 13 Dec 2018, 11:57 am
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనన్నారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. టీడీపీతో పొత్తు వద్దని తాను ముందే వ్యతిరేకించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తన మాటలను కొందరు నేతలు పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణలో ఓడిపోయామన్నారు.
Samayam Telugu vijayashanthi


టీడీపీతో పొత్తు వల్ల కలిసిన నష్టాన్ని త్వరలోనే హైకమాండ్‌కు వివరిస్తానని విజయశాంతి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లోపు జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని అధిష్ఠానానికి సూచిస్తానన్నారు. టీడీపీతో పొత్తు కొనసాగితే కాంగ్రెస్‌కు మరింత నష్టం జరుగుతుందని విజయశాంతి హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పొత్తు పెట్టుకుని ప్రజాకూటమి పేరుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కే తిరిగి పట్టం కట్టారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ఓటర్లు తిరస్కరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడం వల్లనే ప్రజాకూటమి ఓటమి పాలైందన్న విమర్శలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.