అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై గవర్నర్ ను మరింత ఇరుకున పెట్టాలన్న కాంగ్రెస్ పార్టీ
వ్యూహానికి ఆపార్టీ నేతలే తూట్లు పొడిచారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్లో గవర్నర్ ఇచ్చే 'ఎట్ హోం' కార్యక్రమాన్ని బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేయాలన్న పీసీసీ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు ఖాతరు చేయకపోవడం చర్చనీయాంశమైంది.
టీఆర్ఎస్ కు గవర్నర్ నరసింహన్ ఏజెంట్ మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ టీ-కాంగ్రెస్ నేతలు ఏకంగా రాజ్ భవన్ లో ఆయన ముందే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసింహన్ ఇచ్చే ‘గవర్నర్ ఎట్ హోమ్’ తేనీటి విందు కార్యక్రమాన్ని బహిష్కరించాలని టీ-కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే ఇవేవి లెక్కచేయకుండా దానం నాగేందర్, రాపోలు ఆనందభాస్కర్ ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా గాంధీభవన్లో కలకలం రేగింది. దీనిపై ఆరా తీయగా ఎంట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయం తనకు తెలియదని రాపోలు ఆనందభాస్కర్ సమాధానం ఇచ్చారు. తెలిస్తే వెళ్లే వాడినే కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు
వ్యూహానికి ఆపార్టీ నేతలే తూట్లు పొడిచారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్లో గవర్నర్ ఇచ్చే 'ఎట్ హోం' కార్యక్రమాన్ని బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేయాలన్న పీసీసీ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు ఖాతరు చేయకపోవడం చర్చనీయాంశమైంది.
టీఆర్ఎస్ కు గవర్నర్ నరసింహన్ ఏజెంట్ మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ టీ-కాంగ్రెస్ నేతలు ఏకంగా రాజ్ భవన్ లో ఆయన ముందే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసింహన్ ఇచ్చే ‘గవర్నర్ ఎట్ హోమ్’ తేనీటి విందు కార్యక్రమాన్ని బహిష్కరించాలని టీ-కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే ఇవేవి లెక్కచేయకుండా దానం నాగేందర్, రాపోలు ఆనందభాస్కర్ ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా గాంధీభవన్లో కలకలం రేగింది. దీనిపై ఆరా తీయగా ఎంట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయం తనకు తెలియదని రాపోలు ఆనందభాస్కర్ సమాధానం ఇచ్చారు. తెలిస్తే వెళ్లే వాడినే కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు