యాప్నగరం

Rahul Gandhi: కాంగ్రెస్ బూత్‌ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్

తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్.. ఇవాళ నగరంలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Samayam Telugu 14 Aug 2018, 1:10 pm
తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్.. ఇవాళ (రెండో రోజు) నగరంలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో దిశా నిర్దేశం చేశారు. దీనిపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అలాగే బూత్‌లెవల్స్‌లో చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.
Samayam Telugu రాహుల్.


టెలీకాన్ఫరెన్స్ తర్వాత 40మంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంతో పాటూ.. తెలంగాణలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాహుల్ తర్వాత పత్రికలు, టీవీ ఛానెళ్ల ఎడిటర్లతో సమావేశం నిర్వహించారు. 12 గంటలకు యువ సీఈవోలతో కాంగ్రెస్ అధ్యక్షుడు భేటీ అవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్‌పార్క్‌ వరకు బస్సు యాత్ర నిర్వహిస్తారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళులు అర్పిస్తారు.

సాయంత్రం నాలుగున్నరకు సరూర్ నగర్‌ స్టేడియానికి బస్సు యాత్ర మొదలవుతుంది. ఐదున్నర గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి నిరుద్యోగ గర్జనలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.