యాప్నగరం

బాబు పోస్టర్‌ను చించి, చింతమనేనిపై ఫైర్!

ఆర్టీసీ బస్సుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోస్టర్ చిరిగి ఉందంటూ, హనుమాన్ జంక్షన్లో ఆ బస్సును అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రభస చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Samayam Telugu 18 Apr 2018, 3:05 pm
ఆర్టీసీ బస్సుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోస్టర్ చిరిగి ఉందంటూ, హనుమాన్ జంక్షన్లో ఆ బస్సును అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రభస చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాల్లో వినిపించిన చింతమనేని పేరు ఇప్పుడు మరో దాడి విషయంలో వినిపిస్తోంది. ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ సంక్షేమపథకాల ప్రచారానికి గానూ అతికించిన పోస్టర్ చిరిగి ఉండటంపై చింతమనేని మండిపడ్డట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
Samayam Telugu Chintamaneni Prabhakar2


బస్సును ఆపి, డ్రైవర్‌ను కండక్టర్‌ను చింతమనేని దుర్భాషలాడినట్టుగా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే ఇలా ప్రవర్తిస్తుండటంతో స్థానికుడొకరు అడ్డుచెప్పినట్టుగా, అతడిపై ఎమ్మెల్యే భౌతిక దాడికి పాల్పడ్డారు అని హనుమాన్‌జంక్షన్లో నిన్న నిరసన కార్యక్రమం కూడా ఒకటి జరిగింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నేత సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు తను పెంచుకున్న కుక్కలను ప్రజల మీదకు వదులుతున్నారని ధ్వజమెత్తారు. అమాయకులపై చింతమనేని దాడికి పాల్పడ్డారు అని విమర్శించారు.

అంతేగాక చంద్రబాబు నాయుడు పోస్టర్‌ను ఆమె చించారు. చింతమనేనికి ఇప్పుడు దమ్మూధైర్యం ఉంటే తనపై దాడికి రావాలని ఆమె సవాల్ విసిరారు. టీడీపీ నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేయకుండా, పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారని ఆమె విరుచుకుపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.