యాప్నగరం

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనడం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఇదే.

Samayam Telugu 13 Aug 2018, 11:07 am
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణలో పర్యటన సోమవారం ప్రారంభం అవుతోంది. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. 3 గంటల నుంచి 4 గంటల మధ్య శంషాబాద్ క్లాసిక్ త్రీ కన్వెన్షన్ సెంటర్‌లో స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో భేటీ అవుతారు. అనంతరం నగరానికి బస్సు యాత్రతో చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నరకు శేరిలింగంపల్లి ప్రజాచైతన్య యాత్ర సభలో రాహుల్ ప్రసంగిస్తారు. రాత్రి హరిత ప్లాజాలో ఆయన బస చేస్తారు.
Samayam Telugu rahul gandhi raga


బూత్ కమిటీ ప్రెసిడెంట్లకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో మంగళవారం రాహుల్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఉదయం 10.30 గంటలకు పత్రికలు, టీవీ ఛానెళ్ల ఎడిటర్లతో సమావేశం నిర్వహిస్తారు. 12 గంటలకు యువ సీఈవోలతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్‌పార్క్‌ వరకు బస్సు యాత్ర నిర్వహిస్తారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు పుష్పాలతో రాహుల్ అంజలి ఘటిస్తారు.

సాయంత్రం నాలుగున్నరకు సరూర్ నగర్‌ స్టేడియానికి బస్సు యాత్ర మొదలవుతుంది. ఐదున్నర గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి నిరుద్యోగ గర్జనలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.