యాప్నగరం

ఢిల్లీలో చంద్రబాబు.. ఆజాద్‌తో కీలక చర్చలు

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఏపీ సీఎంను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. 15 నిమిషాల పాటూ కొనసాగిన భేటీ.. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చలు..

Samayam Telugu 1 Nov 2018, 2:22 pm
ఢిల్లీ పర్యటనలో బిజీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. గురువారం మధ్యాహ్నం హస్తిన చేరుకున్న బాబును.. ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కలిశారు. ఇద్దరు నేతలు దాదాపు 15 నిమిషాలపాటూ సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయాలతో పాటూ.. కూటమి ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే సాయంత్రం 3.30 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ మాత్రమే కాదు.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను కూడా కలవబోతున్నారు.
Samayam Telugu Ajad


బీజేపేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే పనిలో ఉన్న చంద్రబాబు.. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు, పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడులు, ఏపీ ప్రత్యేక హోదా వంటి అంశాలను నేతలతో ప్రస్తావించనున్నారు. అలాగే చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.